భూధ రాళ్ల పంచాయతీలో సమస్యలను పరిష్కరించాలి
బిజెపి పార్టీ పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు
కొయ్యూరు అఖండ భూమిన వంబరు 12 అల్లూరి జిల్లా వెబ్ న్యూస్ :
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లో భూధ రాళ్ల పంచాయతీ మారుమూల గ్రామాల్లో బిజెపి పార్టీ పాడేరు అసెంబ్లీ కన్వీనర్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు కేంద్ర కాపీబోర్డు మెంబర్ ప్రభాకర్ ఆదివారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూధ రాళ్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామంలో రోడ్డు సదుపాయం, తాగునీరు లేని గ్రామాలు అనేకం ఉన్నాయని వెంటనే ప్రభుత్వ అధికారులు పర్యటించి ఆ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలు డోలుమోతలతో ప్రసవాలకు తీసుకెళ్లే పరిస్థితి ఉత్పన్నమవుతున్నాయని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి గ్రామ యువజన పథకం ప్రధానమంత్రి జనజీవన పథకం ఎంజి ఎన్ఆర్ ఈజీఎస్ పథకం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు ముఖ్యంగా రోడ్డు తాగునీరు స్కూలు అంగన్వాడి భవనాలు లేని చోట వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అదుపుల రాజు మండల ప్రధాన కార్యదర్శి త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు



