గంజాయి సాగు చేస్తున్న ఇద్దరి అరెస్ట్… ఎస్ఐ. సంతోష్ కుమార్..
డుంబ్రిగుడ నవంబర్ 12. (అఖండ భూమి ):డుంబ్రిగుడ మండలం కించుమండ పంచాయతీ బీజమరవలస శివారులలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ముందస్తుగా అందడంతో ఆదివారం తమ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా కొర్రా. కేశవరావు, కిల్లో. లైకోన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని, వీరు గ్రామ శివారులో 10సెంట్ల భూమిలోవంద గంజాయి మొక్కలు సాగు చేస్తూ పట్టుపడ్డారని ఎస్ఐ చెప్పారు.వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమనిచెప్పారు.