నేటి నుంచి తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివర అంకానికి చేరుకోగా.. ప్రచారంలో అన్ని పార్టీల స్పీడ్ పెంచాయి. నేడు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు..
మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, రేపు తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు..