
ధాన్యం కొనుగోళ్ళలో ఎటువంటి కటింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే.
సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి..
(అఖండ భూమి) కొమురం భీం జిల్లా, డిసెంబర్ 13, దేహగాం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా,దహేగాం మండల కేంద్రంలో మంగళవారం రోజు దహేగాం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ..
గతంలో మాదిరిగా రైతులు అమ్మిన ధాన్యం విషయంలో వడ్ల కటింగ్ చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. వ్యవసాయ,సహకార, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల వద్ద నుండి ఎటువంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని , అలాగే రైతుకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించాలని సూచించారు.
అధికారులందరూ రైతుల సేవలో నిమగ్నమై, రైతాంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాసరి వేణు, డి సి ఓ తారామణి, ఎం పి డి ఓ రాజేశ్వర్, సి ఓ, బక్కయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం అధికారులు, సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతి గౌడ్, వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ్, సర్పంచ్ పుప్పాల లక్ష్మీ , ఎంపిటిసి రాపర్తి జయ, మరియు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


