
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మక కార్యక్రమం యువగళం నవశకం సభ బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో జరగనుంది. ఈ సభ కు తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండడంతో యావత్ ఆంధ్ర ప్రదేశ్ చూపు ఈ సభ పై పడింది. ఈ సభకు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లోకవరపు బాబులు నాయుడు, మాజీ ఎంపీటీసీ మాకిరెడ్డి నాని ల ఆధ్వర్యంలో నల్లబెల్లి దేముడు నాయుడు, బాబులు, సత్తిబాబు, రవి,వేకునాయుడు,అప్పలనర్సిమూర్తి, రమణ,కార్యకర్తలు, అభిమానులు పోలిపల్లికి కార్లలో బయలుదేరారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!

