
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మక కార్యక్రమం యువగళం నవశకం సభ బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో జరగనుంది. ఈ సభ కు తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండడంతో యావత్ ఆంధ్ర ప్రదేశ్ చూపు ఈ సభ పై పడింది. ఈ సభకు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లోకవరపు బాబులు నాయుడు, మాజీ ఎంపీటీసీ మాకిరెడ్డి నాని ల ఆధ్వర్యంలో నల్లబెల్లి దేముడు నాయుడు, బాబులు, సత్తిబాబు, రవి,వేకునాయుడు,అప్పలనర్సిమూర్తి, రమణ,కార్యకర్తలు, అభిమానులు పోలిపల్లికి కార్లలో బయలుదేరారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం

