నవ శకానికి నాంది పలికేందుకు చెర్లోపాలెం టిడిపి శ్రేణులు పయనం.


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మక కార్యక్రమం యువగళం నవశకం సభ బుధవారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి లో జరగనుంది. ఈ సభ కు తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండడంతో యావత్ ఆంధ్ర ప్రదేశ్ చూపు ఈ సభ పై పడింది. ఈ సభకు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ లోకవరపు బాబులు నాయుడు, మాజీ ఎంపీటీసీ మాకిరెడ్డి నాని ల ఆధ్వర్యంలో నల్లబెల్లి దేముడు నాయుడు, బాబులు, సత్తిబాబు, రవి,వేకునాయుడు,అప్పలనర్సిమూర్తి, రమణ,కార్యకర్తలు, అభిమానులు పోలిపల్లికి కార్లలో బయలుదేరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!