పీకిసాన్ పథకానికి అర్హులైన రైతులందరికీ ఈకేవైసీ పూర్తి చేయాలి

 

 

 

పీకిసాన్ పథకానికి అర్హులైన రైతులందరికీ ఈకేవైసీ పూర్తి చేయాలి

పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి, (అఖండ భూమి), ఫిబ్రవరి 23:పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరికీ ఈ కేవైసీ పూర్తి చేయించాలని పెదవలస సర్పంచ్ పాంగి కృష్ణవంశీ అన్నారు.శుక్రవారం పెదవలస రైతు భరోసా కేంద్రంలో రైతులకు ఈ కేవైసీ చేస్తున్న విధానాన్ని మండల వ్యవసాయ అధికారి టి. మధుసూదన్ రావు తో కలిసి సర్పంచ్ పరిశీలించారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ కేవైసీ పూర్తి చేయాలని,రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్లకు సహకరించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మధుసూదన్ రావు, అగ్రికల్చర్ అసిస్టెంట్ రవీంద్ర, వీఆర్వో గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!