నేడు ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి

 

 

నేడు ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం.. త్రిపురాంతకం ఫిబ్రవరి 23( అఖండ భూమి): నేడు త్రిపురాంతకంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు) త్రిపురాంతకం మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆఫీస్ ఆవరణ నందు ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందనీ దోర్నాల మండల సిపిఐ కార్యదర్శి మానేపల్లి విస్వరూపా చారి విలేకరుల సమావేశంలో వివరించడం జరిగింది. సిపిఐ నాయకులు కీ,శే,, గాలి సుబ్బరాయుడు గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈ కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పెద్దకాకాని గుంటూరు జిల్లా శంకర్ కంటి వైద్యశాల నిపుణులు పరీక్షలు నిర్వహిస్తున్నారని అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తున్నారని ఆయన సందర్భంగా తెలియపరచి ఉన్నారు, ఈ సదవకాశాన్ని యావన్మంది ప్రజానీకం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అందత్వ సంస్థ సహకారం కూడా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పూర్ణ కంటి తిరుమలయ్య జెడ్డా రామయ్య కళ్లే నాగార్జున అశోక్ మణికంఠ ఎస్ కే బాషా తదితరులు పాల్గొన్నారు ఈ శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలని వచ్చేవారికి ఉచిత భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ,పూర్తి వివరాలకు ఈ క్రింది సెల్ నంబర్లను సంప్రదించగలరు, సెల్.9052590795, సెల్,6301452014

Akhand Bhoomi News

error: Content is protected !!