నంద్యాల మండలంలోని బిల్లాలాపురం గ్రామంలో 82 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన MLA శిల్పా రవి…

 

 

నంద్యాల ఫిబ్రవరి 23( అఖండ భూమి) న్యూస్:

నంద్యాల మండలంలోని బిల్లాలాపురం గ్రామంలో 82 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన MLA శిల్పా రవి…

అందులో 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, 22 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 20 లక్షల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాము.

నాడు “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభించడం ఎంతో సంతోషకరం…

తమ గ్రామం బాగు కోసం ముందుకు వచ్చి తమ స్వంత స్థలాలను ప్రభుత్వ భవనాలకు ఇచ్చిన గ్రామ పెద్దలు వెంకటకృష్ణారెడ్డి గారిని, పెద్ద రామకృష్ణారెడ్డి గారిని, చిన్న రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు MLA.

Akhand Bhoomi News

error: Content is protected !!