గిరిజన ప్రాంత అభివృద్ధి తెలుగుదేశంతోనే..మిరియాల శిరీషాదేవి 

 

 

గిరిజన ప్రాంత అభివృద్ధి తెలుగుదేశంతోనే..మిరియాల శిరీషాదేవి

రాజవొమ్మంగి ఫిబ్రవరి 23 (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో గిరిజన ప్రాంతంలోని అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడేది ఒక్క తెలుగుదేశమే అని, వారి సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని, కాబట్టి తెలుగుదేశంతోనే నడుద్దామని, సైకిల్ కి ఓటేసి చంద్రబాబు ముఖ్యమంత్రి చెయ్యాలని మిరియాల శిరీషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం అమ్మిరేకుల,కిమ్మలగెడ్డ గ్రామాల్లో పర్యటించి బాబుష్యురిటీ-భవిష్యత్ కు గ్యారంటీ కరపత్రాలు పంచి 6 గ్యారంటీల గురించి ప్రజలకు వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో మంచి స్పందన ఉందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమౌతుందని ప్రజలే అంటున్నారని ఆమె అన్నారు. మాకు జీడిమామిడి తోటలు పెంపకం, 10వతరగతి పెయిల్ అయినా అంట్రైన్డ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాల ఆర్ధిక స్వావలంబనకు దోహదపడింది తెలుగుదేశమే అని, మా పిల్లల చదువులకు ఆశ్రమ పాఠశాలలు నిర్మించింది తెలుగుదేశమే అని లోతట్టు ప్రాంత ప్రజలు అంటున్నారన్నారు. మీకు మరింత సంక్షేమం,అభివృద్ధి చెయ్యడానికి 6 గ్యారంటీలే కాకుండా జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే విడుదల చేస్తారని జనసేన టీడీపీ తోనే మన సంక్షేమం, అభివృద్ధి రెట్టింపు అవుతాయని టీడీపీ, జనసేన కూటమిని ఆశ్వీరదించండి అని మిరియాల శిరీషదేవి అన్నారు.తన భర్త అయిన నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు మఠం విజయభాస్కర్ తో కలిసి ఆయా గ్రామాలు విస్తృతంగా పర్యటించి 6 గ్యారంటీల కరపత్రాలు పంపిణీ చేసారు.

Akhand Bhoomi News

error: Content is protected !!