నియోజకవర్గ ప్రజల చూపు ఆమె వైపే… టిడిపి మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు

 

(కోటనందూరు మండలం)

తుని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య వైపు నియోజకవర్గ ప్రజలు మ్రొగ్గు చూపుతున్నారని, ఆమె గెలవాలని ఆశగా ఆసక్తితో ఎదురుచూస్తున్నారని మండల యువనాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు తెలిపారు. మొక్కవోనిదీక్షతో ప్రజాసమస్యలను ప్రజలవద్దకు వెళ్ళి తెలుసుకుంటూ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆమెకు వస్తున్న ఆధరణ చూసి వైసిపి నేతలే ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారంటూ ఇప్పటికే పార్టీలకతీతంగా పలువురు విశ్లేషకులు పొగడ్తలు కురిపిస్తున్నారని బుల్లిబాబు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామాలలో కనీసం మురుగు కాలువ కూడా నిర్మించలేదని ఎటువంటి అభివృద్ధిని చేపట్టలేదని, నియోజక వర్గంలో గ్రామాలన్నీ సమస్యల వలయంలో చిక్కుకొని ఊగిసలాడుతున్నాయని వైసీపీని గడ్డేదించాలని ప్రజలు లోలోపల భావిస్తున్నారని ఆయన అన్నారు. యనమల కుమార్తె ఎమ్మెల్యేగా గెలిస్తే గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారని అనేక సమస్యలతో సతమతమవుతున్న గ్రామ సీమలో యనమల దివ్యను గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమోనని ఆమెను గెలిపించేందుకు తమ వంతు బాధ్యత గా ముందడుగు వేయాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంతో నియోజకవర్గంలోని గ్రామాలన్నింటినీ పర్యటించిన యనమల దివ్య అన్ని గ్రామాలలోని సమస్యలను తెలుసుకుని వాటిని ప్రత్యేకంగా రాసుకుని పక్కాప్రణాళిక తో వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని మాటనిస్తూ రాబోయే ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని సవాల్ చేస్తూ ముందుకు నడిచారని అందుకే నియోజకవర్గంలోని ప్రజలు ఆమె పై నమ్మకముంచి ఆమె గెలవాలని ఆశతో చూస్తున్నారని ఆయన అన్నారు.ప్రజల నమ్మకం తో ప్రజల ఆశీస్సులతో యనమల దివ్య గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!