(కోటనందూరు మండలం).
కోటనందూరు లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ప్రముఖ పారిశ్రామికవేత్త వెలగ వెంకట గంగాధర రంగ నాయకులు వారి కుమారుడు వెలగ వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అందులో భాగంగా రెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన ప్రాచీన సీతారాముల వారి చిన్న రామాలయం వద్ద వృద్ధులకు, వికలాంగులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యనమల రాజేష్ విచ్చేశారు. ఆయనకు ముందుగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనముతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుక పురస్కరించుకొని వృద్ధులు వికలాంగులతో కేక్ కట్ చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, అంకం రెడ్డి రమేష్, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అంకం రెడ్డి సత్యనారాయణ, ఎల్లపు వెంకటరమణ, పల్లా రామకృష్ణ, చింతల శ్రీను, పడాల సత్యనారాయణ, ముస్లిం మైనార్టీ సభ్యుడు షేక్ మీర, పల్లా కిషోర్ , అంకం రెడ్డి అప్పలనాయుడు, లాలం గోవిందు, పల్లా రాము, పంపన బోయిన సత్యనారాయణ, గింజల చల్లారావు తదితరులు పాల్గొన్నారు.

You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



