చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. ఆలమూరు ఎస్సై శ్రీను నాయక్

 

 

 

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు.
ఆలమూరు ఎస్సై శ్రీను నాయక్ .

ఆలమూరు (అఖండ భూమి):చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డివిజన్ రావులపాలెం సర్కిల్ పరిధిలోని ఆలమూరు ఎస్సై ఎల్ శ్రీను నాయక్ మరోసారి హెచ్చరించారు. ఆలమూరు మండలంలోని వివిధ గ్రామ ప్రాంతాలలో ప్రజలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సత్ప్రవర్తనతో మెలిగేవారికి పోలీసుల సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రశాంతంగా పూర్తయినప్పటికీ ప్రజల దృష్టి ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై ఆశక్తి నెలకొందని ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారన్నారు. అయితే ప్రజలు ఎవరికి వారు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రస్తుతం ఎన్నికల లెక్కింపులపై ఎన్ని వాదనలు వినిపించుకున్నా ప్రయోజనం లేదని,ఫలితాలతో హీటు పెరిగిందని గెలిచేది తమ అభ్యర్థులే అంటే తమ అభ్యర్థులే అని పలు రాజకీయ పార్టీల వారు అంటున్నారన్నారు.అలాగే వాట్సాప్,ఫేస్బుక్,ట్విట్టర్(ఎక్స్) వంటి సోషల్ మీడియాలలో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల రాజకీయ అల్లర్లు చెలరేగుతున్నాయని ఇప్పటికే తమ బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!