అన్ని దానములలోకెల్ల అన్నదానం మహా గొప్పది.

 

 

అన్ని దానములలోకెల్ల అన్నదానం మహా గొప్పది.

ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలంలోని సంధిపూడి గ్రామానికి చెందిన నామాల యేసు రాజు(సాక్షి రాజు),పద్మ దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం కొత్తూరు సెంటర్లో గల ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ముందుగా యేసు రాజు దంపతులు స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.సుమారు 100 మంది ప్రజలు అన్నదానాన్ని స్వీకరించారు.అనంతరం యేసు రాజు,పద్మ దంపతులను ఆశీర్వదించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నదాతా సుఖీభవ అని దీవించారు. ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలు కోరారు.ఇలాంటి మంచిసేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నామని యేసు రాజు దంపతులు నిండు నూరేళ్ళు చల్లాగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్యాలతో ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని దీవించి వారిని ఆశీర్వదించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!