రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా అనాధా ఆశ్రమంలో అన్నదానం     అనాధలకు చేయూత ప్రతి ఒక్కరి బాధ్యత

 

 

 

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా అనాధా ఆశ్రమంలో అన్నదానం

అనాధలకు చేయూత ప్రతి ఒక్కరి బాధ్యత

యర్రగొండపాలెం అఖండ భూమి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి,మరియు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు, ఆదేశాల మేరకు మంగళవారం రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, నియోజకవర్గ ఇన్చార్జ్ బూదాల, అజితారావు మరియు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నల దాసు ప్రవీణ్ కుమార్, ప్రకాశం జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని సన్ జో మానసిక వికలంగులా ఆనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పండ్లు, పంపిణీ అన్నదాన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా అన్నల దాసు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా దేశాన్ని కి ఐటి రంగాన్ని పరిచయం చేసి యువతకి ఉద్యోగ,ఉపాధి అవకాశాలను కల్పించడంలో పెద్దన్న పాత్రను పోషించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.

సమాజంలో అనాధలుగా అభాగ్యులుగా మిగిలిపోయిన వారికి మనం తోడ్పాపాటు అందించాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మానసిక వికలాంగుల ఆశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చు సూరి వెంకటేశ్వర్లు నాయక్ బాలకృష్ణారెడ్డి ప్రవీణ్ పాత్రికేయులు ఉప్పలపాటి యేసేబు, ఆవుల యేసు బాబు తప్పెట్ల కోటేశ్వరరావు,సొసైటీ ప్రెసిడెంట్ డి మంత్రుల నాయక్ ఆర్ .అంజి నాయక్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!