ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల పరిరక్షణ మండలి సమావేశము.

ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల పరిరక్షణ మండలి సమావేశము.

ఎర్రగొండపాలెం అఖండ భూమి..
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఏపీ ఎన్జీవో సంఘ కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల పరిరక్షణ మండలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశమునకు అధ్యక్షులు ఆలేటి. నాగయ్య వహించారు.ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మన హక్కులను మనమే నిర్వర్తించుకునే స్థాయికి రావాలి అన్నారు. ఐక్యమత్తంగా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి మరెన్నో హక్కులను ఉన్నత పదవులు పొందాలని అన్నారు. ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు బూదాల .గురవయ్య మరియు దోర్నాల ఎర్రగొండపాలెం పుల్లల చరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు మండల ప్రెసిడెంట్లు, కాకర్ల దేవరాజు , చేదురి లక్ష్మయ్య, వెలిశాల. కోటేశ్వరరావు, పోలబోయిన. సుబ్బారావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ ,రాజు, లూక నగేష్, రాములు నాయక్ లక్ష్మి, నాగమణి, పల్లె ఏసుదాసు, నాగేశ్వరమ్మ, మునగువారి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆలేటి నాగయ్యకు నియామక పత్రమును అందచేయుట జరిగింది. ఈ మండలి కొరకు నా వంతు సహాయ సహకారములను అందజేసి ఎస్సీ ఎస్టీ హక్కుల కొరకు జిల్లా స్థాయిలో పనిచేయడం జరుగుతుందని తెలిపినారు. ఈ సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ రాజ్ లుక్ జిల్లా అధ్యక్షులు భూదాల గురవయ్య కార్యదర్శి ఆలేటి నాగయ్య కోటేశ్వరరావు నగేష్ ధనరాజ్ లక్ష్మి లక్ష్మయ్య సుబ్బారావు మున్నగువారు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!