కోటనందూరు మండలం.
అల్లిపూడి మండల ప్రాథమిక పాఠశాల ఏబిఆర్ స్కూల్ లో తుని నియోజక వర్గ శాసన సభ్యులు యనమల దివ్య ఆదేశాల మేరకు విద్యార్థి విద్యార్థినులకు స్టూడెంట్ కిట్ లను మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుల్లిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక విద్య చాలా ముఖ్యమని, నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు కు మీరే బాటలు వేయాలని ఉపాధ్యాయులను ఆయన కోరారు. అంతేకాకుండా పాఠశాల అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంకంరెడ్డి గోపి, చింతకాయల సురేష్, న్యాయవాది కొండ్రు కళ్యాణ్ మరియు గ్రామ పెద్దలు కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాడి చల్లారావు, ఉపాధ్యాయులు వరప్రసాద్, వాసు,భవిత మరియు గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



