కోటనందూరు మండలం.
అల్లిపూడి మండల ప్రాథమిక పాఠశాల ఏబిఆర్ స్కూల్ లో తుని నియోజక వర్గ శాసన సభ్యులు యనమల దివ్య ఆదేశాల మేరకు విద్యార్థి విద్యార్థినులకు స్టూడెంట్ కిట్ లను మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుల్లిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక విద్య చాలా ముఖ్యమని, నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు కు మీరే బాటలు వేయాలని ఉపాధ్యాయులను ఆయన కోరారు. అంతేకాకుండా పాఠశాల అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంకంరెడ్డి గోపి, చింతకాయల సురేష్, న్యాయవాది కొండ్రు కళ్యాణ్ మరియు గ్రామ పెద్దలు కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాడి చల్లారావు, ఉపాధ్యాయులు వరప్రసాద్, వాసు,భవిత మరియు గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం



