ఆంధ్రప్రదేశ్ లో “ఎన్టీఆర్ భరోసా”అనే పేరు తో పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యింది. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్ అందిస్తామంటూ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే.దీనితో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లిపూడి లో తెలుగుదేశం పార్టీ కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలకు రూ.1000 చొప్పున మరియు ఈ నెల రూ.4000 తో కలిపి రూ.7,000 పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం అర్హులకు అందిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్