అల్లిపూడి లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన కార్యక్రమం ప్రారంభం.

 

కోటనందూరు మండలం.

అల్లిపూడి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కార్యక్రమాన్ని మండల టిడిపి నాయకులు అంకంరెడ్డి బుల్లి బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థులందరికీ శుభదిన్ భోజన కార్యక్రమం లో బుల్లిబాబు సౌజన్యంతో ఏర్పాటుచేసిన పసందైన విందు భోజనాన్ని ఆయన స్వయంగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే ప్రతి కార్యక్రమంలోనూ మా తోడ్పాటు ఉంటుందని తెలిపారు. కాగా గత ప్రభుత్వంలో అన్ని విద్యా పథకాలకు మాజీ ముఖ్యమంత్రి తన పేరును పెట్టుకుంటే ఈ ప్రభుత్వంలో ప్రజలు గర్వించదగ్గ భరతమాత ముద్దుబిడ్డల పేర్లను విద్యా పథకాలకు పెట్టడం ఆదర్శనీయమని కొనియాడారు. విద్యార్థులకు మంచి భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా స్థాయిలో గ్రామ పాఠశాల విద్యార్థులు వారి ప్రతిభను చాటే విధంగా వారికి సమగ్ర నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్,పసగడుగుల ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!