సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు
హైదరాబాద్:ఆగస్టు 19 అఖండ భూమి వెబ్ న్యూస్ :
రక్షా బంధన్ సందర్భంగా.. సోమవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్కు రాఖీలు కట్టారు.
సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు..
రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరి యాలని.. మనసారా కోరుకుంటున్నాను’ అని రేవంత్ రెడ్డి అన్నారు..
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



