సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి —– మున్సిపల్ చైర్ పర్సన్

 

 

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి

—– మున్సిపల్ చైర్ పర్సన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 (అఖండ భూమి):

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ, చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యపుస్తకాలలో రూపొందించే విధంగా ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. కల్లుగీత కార్మికులకు చెట్లు ఎక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ మోపు అనే యంత్రాన్ని అందించడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాహసాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. మొగులాయి దౌర్జన్యాన్ని ఎదిరించి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు రమేష్ గౌడ్, ప్రతినిధులు రాజా గౌడ్ ,హరికిషన్ గౌడ్, సాయిరాం గౌడ్, బాలార్జున్ గౌడ్, మొగుళ్ల దశ గౌడ్, అమర్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు మల్లయ్య ,శివరాములు, నాగరాజు, పోచవ్వ, మంజుల పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!