నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది

 

శంకర రెడ్డి కిషోర్ రెడ్డి

పిట్టల వాని పాలెం సెప్టెంబర్ 1 (అంఖడ భూమి) :

నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అందుకుంటుందని తెలుగు దేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు భవనంవారిపాలెం కోమలి గ్రామాలు మధ్యలో గల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగిపోయాయని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆదేశానుసారంగ రైతులతో కలసి యజాలి డ్రెయిన్ మురుగు తూములు వద్ద వరద నీటి పారుదల చర్యలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మోదుగుల శంకర రెడ్డి కలకోట కిషోర్ రెడ్డి చిరసాని శ్రీనివాస రెడ్డి తమ్మ సుబ్బారెడ్డి మానుకొండ శివరామ శేషిరెడ్డి భరతా రెడ్డి దొంతిరెడ్డి రామకృష్ణ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!