పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న టిడిపి మండల అధ్యక్షులు
కోటనందూరు మండలం కే ఏ మల్లవరం గ్రామములో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గాడి రాజబాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వృద్ధులు, బలహీనులు, వితంతువులు మరియు వైకల్యం మొదలైన వారి కష్టాలను తీర్చడానికి మరియు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు వీలుగా సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టిందని అందుకు అనుగుణంగా పెన్షన్ ను పెంపొందించారని ప్రజలకు తెలియజేశారు. ముఖ్యంగా పేదలు మరియు వృద్దులకు మరింత సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
-
రాక్స్ తుని రూరల్ మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిరుకూరి లోవరాజు
-
తెలంగాణ భవన్ లో బిఆర్ ఎస్వి ప్రతినుధుల సమావేశం
-
ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
-
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధి తో దేశ అభివృద్ధి
-
అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?