శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు

 

శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు

బెల్లంపల్లి అక్టోబర్ 14{అఖండ భూమి}: బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తికి చెందిన ఆడేటి శ్రీనివాస్(45) అనే సింగరేణి కార్మికుడు చనిపోగా అతడి శవయాత్ర సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు.శవయాత్ర పోచమ్మ చెరువు దగ్గరకు చేరుకోగా,సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు ఉన్న తేనేతీగలు ఒక్కసారిగా శవయాత్ర పై దాడిచేయడం తో పాడేను వదిలేసి అందరు పరుగులు తీశారు.తేనే తీగాల దాడిలో గాయపడిన బాధితుల తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.అనంతరం సుమారు 2 గంటల తర్వాత అంతక్రియలు జరిగాయి…

Akhand Bhoomi News

error: Content is protected !!