తుని. అక్టోబర్ 18 అఖండ భూమి
తుని మండలంలో రాక్స్ అధినేత డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ గారి ఆదేశాల మేరకు డి పోలవరంకు చెందిన యువ ఉద్యమ నాయకులు చిరుకూరి లోవరాజును తుని రూరల్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాక్స్ పోరాటంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. మాలల కోసం ఉద్యమం చేసేందుకు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అనేక గ్రామాల్లో తిరుగుతూ నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజలను చైతన్య పరుస్తున్నారని, జాతి కోసం నిస్వార్ధంగా జరిగే ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.
You may also like
-
తెలంగాణ భవన్ లో బిఆర్ ఎస్వి ప్రతినుధుల సమావేశం
-
ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చు… అడ్డుకోవద్దు… ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
-
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల అభివృద్ధి తో దేశ అభివృద్ధి
-
అంతు చూస్తానని చెప్పుకుంటున్న (ఆ) పెద్దమనిషి..? -నిజాలను నిర్భయంగా రాస్తే అంతు చూస్తాడా..?
-
శవయాత్ర పై తేనెతీగల దాడి పలువురికి గాయాలు