తెలంగాణ భవన్ లో బిఆర్ ఎస్వి ప్రతినుధుల సమావేశం

 

 

తెలంగాణ భవన్ లో బిఆర్ ఎస్వి ప్రతినుధుల సమావేశం

బెల్లంపల్లి అక్టోబర్ 17{అఖండ భూమి}:గురువారం రోజున తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వి ప్రతినిధుల సమావేశం జరిగింది.

బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న ,మాజీ ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ కలిసిన

బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్.

ఈ సందర్భంగా కేటీ రామన్న మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లాలోని ప్రతి కాలేజీలో,ప్రతి మండలాల్లో బీఆర్ఎస్వి కమిటీలువేసి,విద్యా వ్యవస్థపైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణి విధానాన్ని ఎండగట్టాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ లు,ఫీజు రియంబర్స్మెంట్ మెంట్ ఇచ్చే విధంగా పోరాటం చేయాలని గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించే విధంగా అద్దె భవనాలకు అద్దెలు కట్టే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అలాగే జిల్లాలో విద్యార్థుల బలోపేతం కోసం నిరంతరం పని చేయాలని సూచించారు.పార్టీ కోసం పనిచేసే విద్యార్థి నాయకులకు వచ్చే రోజులలో సమూచితస్థానం కలిపిస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర కార్యదర్శి పరుశురాం,బెల్లంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్వి నాయకులు,ఆడెపు అరుణ్,బుద్ధర్తి సుమంత్,

వడ్డేపల్లి నితీష్,ఎం నరేష్,శ్రీనివాస్,వంశీ,సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!