*ఆలమూరు జూనియర్ కాలేజీలో టేకు దుంగలు వేలం.*
ఆలమూరు (అఖండ భూమి):మండల కేంద్రం ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సైజులలో ఉన్న 26 టేకు దుంగలను ఈనెల అనగా
నవంబర్ ఆరవ తేదీ నాడు
బహిరంగ వేలం వెయ్యడానికి నిర్ణయించినట్లు ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసి) కృష్ణ తెలిపారు.
ఆసక్తి గల వారంతా ఈ
వేలంలో పాల్గొనవచ్చని
నాలుగవ తేదీ సాయంత్రంలోపు
సదరు కలపను పరిశీలించుకుని
తిరిగి ఇవ్వబడని రిజిస్ట్రేషన్ రుసుముగా రూ.500 లను చెల్లించాలని తెలిపారు.
అనంతరం వేలం పాటలో పాల్గొనదలచిన వారు( తిరిగి చెల్లించే విధంగా) రూ.5వేలను ధరావత్తుగా చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలిపారు.
వేలాన్ని రద్దు పరచడానికి కానీ వాయిదా వేయడానికి
కానీ కళాశాల ప్రిన్సిపాల్ కి
పూర్తి అధికారాలు ఉన్నాయని
ఆసక్తి కలిగిన వాళ్లు నాలుగవ తేదీ సాయంత్రం లోపల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వేలంలో పాల్గొనడానికి తమ పేరును నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
You may also like
-
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మైనర్లు మృతి..!
-
శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి వార్షికోత్సవం లో పాల్గొన్న మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు.
-
ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నిరసన తెలిపిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్..
-
గ్యాస్ వంటలు మాకొద్దు కట్టెల పొయ్య్ వంటలే మాకు ముద్దు
-
తరువాత కలిగిన నిరుపేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చాలి..!