బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య..
-పెర్కిట్ కు చెందిన స్వాతి (18) ప్రియ గా గుర్తింపు..
-తల్లిదండ్రులు రాకముందే మార్చురీకి తరలించిన పోలీసులు..
-కాలర్ పట్టుకుని పోలీసును నిలదీసిన తల్లి..
-కూతురిది ఆత్మహత్య కాదు.. హత్య చేశారని తల్లి ఆరోపణ ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 11 (అఖండ భూమి) ఆర్మూర్. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతి ప్రియ (18) సోమవారం ఉదయం ఉరి వేసుకుని మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటి కళాశాలకు వెళ్లే లోపే స్వాతి ప్రియా మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించడంతో కోపోద్రిక్తురాలైన తల్లి పోలీస్ కాలర్ పట్టుకుని తాము రాకముందే మార్చురీకి ఎలా తరలిస్తారని నిలదీసింది. స్వాతి ప్రియ ది ఆత్మహత్య కాదు హత్య అని. కూతురిని చంపేశారని ఆవేశంగా ఆరోపించింది. తల్లిదండ్రులు రాకముందే మార్చురికి తరలించడంపై కళాశాల విద్యార్థులు బంధువులు. ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చదువుల్లో చక్కగా రాణిస్తూ. ఆటపాటలతో పాటు ఎంతో కలుగునుపుగా ఉండే స్వాతి ప్రియ లేదని తెలిసి బంధుమిత్రులు రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…