నిషేధిత విత్తనాల పట్టివేత
బెల్లంపల్లి మార్చి 03(అఖండ భూమి వెబ్ న్యూస్): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని మల్లిడి క్రాస్ రోడ్ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి ఒక వ్యక్తి పారిపోతుండగా మిగతా ఇద్దరు అటువైపు నుండి వస్తున్నారు.వారిని బైక్ పై మూట లో ఏముంది అని అడగగా సమాధానం చెప్పలేకపోవడంతో అట్టి మూటను చెక్ చేయగా అందులో నిషేధిత పత్తి విత్తనాలు ఉండడంతో వారిని విచారించగా పురుషోత్తం అలాగే గుంటూరుకు చెందిన సురేష్ తోపాటు
అతని గ్రామానికి చెందిన రాజన్న ఇంట్లో మూడు క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయని చెప్పడంతో భీమిలి ఎస్సై విజయ్
పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన భీమిని ఎస్సైని పోలీసు సిబ్బందిని బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ అభినందించారు…
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


