6 న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన పార్టీ జెండా ఆవిష్కరించాలి…
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పోటీ చేయాలి..
ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ పోటీకి సన్నద్ధం కావాలి.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారు.
స్థానిక సంస్థల్లో గెలుపే పార్టీ బలాన్ని నిరూపిస్తుంది.
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 5 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్స్ లో అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రేపు ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో పార్టీ జండా ఆవిష్కరణ చేయాలని సూచించారు. అంతే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పక పోటీ చేయాలనీ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఇప్పటి నుండే ప్రజల్లో ఉంటూ పోటీకి సన్నద్ధం కావాలనీ సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారనీ, స్థానిక సంస్థల్లో గెలుపే పార్టీ బలాన్ని నిరూపిస్తుందనీ అందుకే ప్రతి ఒక్కరూ పోటీ చేసి గెలిచి ప్రజలకు మరింత పారదర్శకమైన పాలన అందించాలని అన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, పీపుల్ ,బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.