షబ్బీర్ అలీ కృషితోనే 50 పడకల ఆసుపత్రి మంజూరు. దోమకొండ ఏప్రిల్ 11 అఖండ భూమి వెబ్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కృషితోనే దోమకొండ లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలుగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. దోమకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తీగల తిరుమల్ గౌడ్.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి పట్టణ అధ్యక్షుడు సీతారాం మధుసూదన్. డైరెక్టర్ గోపాల్ రెడ్డి. మైనార్టీ నాయకుడు కలీమ్ లు మాట్లాడారు. షబ్బీర్ అలీ అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడేవాడని వివరించారు. గతంలో విద్యుత్తు. మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2008లో దోమకొండలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ నిర్వహించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు వివరించారు. అలాగే 2010లో 30 పడకల ఆసుపత్రిని అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్. మంత్రి సుదర్శన్ రెడ్డి నా చేతుల మీదుగా ప్రారంభింప చేశారని వివరించారు. ప్రస్తుతం రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కోరి షబ్బీర్ అలీ 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చి ప్రభుత్వ జీవోను తెప్పించాడని కాంగ్రెస్ నాయకులు వివరించారు. షబ్బీర్ అలీ ఎప్పటికీ శాశ్వత పథకాలపై దృష్టి సారిస్తారు అని వివరించారు. ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రిగా మార్చడంతో దోమకొండకు అదనంగా 14 పోస్టులు కొత్తగా మంజూరు కానున్నట్లు వివరించారు. 30 పడకల ఆసుపత్రి ఉండగా 14 మంది డాక్టర్లు పనిచేస్తుండగా. 50 పడకల ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నట్లు కాంగ్రెస్ నాయకులు వివరించారు. దోమకొండ మండల తో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ప్రభుత్వ వైద్యం అందగా ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని పలుసార్లు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకురావడంతో ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మంజూరు తెప్పించారని వారు వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



