రైతు ధాన్యమును తరుగు పేరుతో రైస్ మిల్లర్ల దోపిడీ.   

 

రైతు ధాన్యమును తరుగు పేరుతో రైస్ మిల్లర్ల దోపిడీ.  లారీకే 13 క్వింటాళ్ల కోత .

పట్టించుకోని అధికారులు.

నష్టపోతున్న రైతులు .

రైతుల నష్టాన్ని ఆపేదెవరు..?

ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోండి.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 02(అఖండ భూమి న్యూస్ );

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్మేందుకు వస్తే అందిన కాడికి తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. ఇంకా ఎవరికి చెప్పాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. ధాన్యానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా గిట్టుబాటు ధర లభిస్తుంది అంటే, అధికారుల నిర్లక్ష్యం కు తోడుగా రైస్ మిల్లుల యజమానులు దోపిడీ కీ గురి చేస్తు రైతన్నల ఉసురుతీస్తున్నారు. చీడపీడల పాడిన పడకుండా తమ పంటల్ని కాపాడుకొని నాలుగు రూపాయల కల్లా చూద్దామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యాన్ని విక్రయించాలని తీసుకు వస్తున్న రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద నిరాశ మిగులుతోంది. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైస్ మిల్లుల దోపిడీ యదేచ్ఛగా కొనసాగుతుంది. రైస్ మిల్లుల దోపిడి పై విజయ క్రాంతి ప్రతినిధి ఆరా తీయగా ఏకంగా ఒక్క లారీకే 13 క్వింటాళ్ల 20 కిలోల ధాన్యాన్ని కోతవిదించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటన కు సంబంధించి పూర్తి వివరా లు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఇందిరాకాంతి పథకం ద్వారా మర్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా బిచ్కుంద మండలంలోని రాదే ఫుడ్ ఇండస్ట్రీస్ (174382) రైస్ మిల్ కు ఏప్రిల్ 25వ తేదీన 619 బస్తాల ధాన్యాన్ని (247.60)కిలోల ధాన్యాన్ని రైస్ మిల్లుకు పంపగా, తరుగు పేరుతో 33 బస్తాలు 13క్వింటల్ల 20 కిలోల ధాన్యన్ని కోత విధించారు. కేవలం 586బస్తాలకు కుదించి 23 క్వింటాళ్ల 440 కిలోలు మాత్రమే ఐకెపి అధికారులకు ట్రక్ షీట్లో రాసి పంపించారు. ఇంత జరుగుతున్న రైతుల పక్షాన తొంగిచూసే నాధుడు లేకపోవడంతో రైతులు లబోది దిబో అంటున్నారు.*రైస్ మిల్లుల యజమానుల దోపిడీని అరికట్టేది ఎవరు* అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైస్ మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న రైస్ మిల్లులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నా ఇప్పుడు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు చేల రేగుతున్నాయి. జిల్లాస్థాయి అధికారుల సమగ్ర పర్యవేక్షణ లేకపోవడంతోనే రైస్ మిల్లుల ఆగడాలు మితిమీరు తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు పేరుతో మోసం చేస్తున్న రైస్ మిల్లపై క్రిమినల్ కేసు లు నమోదు చేసి రైతులను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘూ వాన్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా స్థాయి అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలను సమన్వయం చేసుకుంటూ రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ..ఈ విషయమై నిజాంసాగర్ మండలం ఇందిరా క్రాంతి పథకం ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ ను విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా నిర్లక్ష్య సమాదా నం లభించింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఛన్ని పట్టించి తూకం వేయాల్సి ఉన్న సదరు లారీ చెన్ని పట్టకపోవడంతో తరుగు వచ్చిందని నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. సదరు అధికారి పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతుందనేది స్పష్టమవుతుంది. కనీసం రైతు తరఫున సదరు రైస్ మిల్లు యజమానులతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాల్సిన అధికారి తమకేం పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. తరుగు పేరుతో ఒకే లారీలో 13 క్వింటాళ్ల 20 కిలో ల చొప్పున ధాన్యాన్ని కోత విధించారు . 33 సంచుల ధాన్యాన్ని కోత విధించడంతో సుమారు 30,492 రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యంతో రైస్ మిల్లుల ఇష్టారాజ్యం తో నష్టపోవాల్సి వచ్చిందని మర్పల్లి గ్రామానికి చెందిన

చేనబోయిన రాములు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల ధాన్యాన్ని తరుగు పేరుతో దోపిడీ చేయడం అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!