నా చిరకాల కోరిక సేవలు పూర్తి చేయడమే నా లక్ష్యం…

 

 

నా చిరకాల కోరిక సేవలు పూర్తి చేయడమే నా లక్ష్యం…

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 3 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రాణహిత చేవెళ్ల ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.

నా జీవితకాలపు చిరకాల కోరిక

ప్రాణహిత చేవెళ్ల (కాళేశ్వరం )

నా చివరి శ్వాస వరకు పోరాటం చేసైన దాన్ని పూర్తి చేయించడమే నా లక్ష్యమని అన్నారు.

 

కామారెడ్డి రైతులకు శాశ్వత సాగు నీటి పరిష్కారం చూపిస్తాను దాని లక్ష్యం కోసమే మరింత ప్రయత్నం తో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

 

కామారెడ్డి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యమన్నారు.

 

23 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, వెంటనే నిధులు మంజూరు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం గా మార్చి దాన్ని పూర్తిగానే రద్దు చేయాలని కుట్ర పన్నింది దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ గా మార్చింది దీని ద్వారా పేద రైతుల 3.5 టిఎంసి నీటి పరిధి తో వందల ఎకరాల భూములు కోల్పోవాల్సి వస్తుంది అన్నారు.

 

10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం లో 10 కోట్లు కూడా మంజూరు చేయలేదు అని అన్నారు.

 

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళుతున్నము దీని ద్వారా 2.8 tmc సాగునీరు అందుతుంది గుర్తు చేశారు.

 

పాత డిజైన్ ప్రకారం రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అన్నారు.

 

ప్రాణహిత చేవెళ్ల ,(కాళేశ్వరం) పనులు భూ సేకరణ , ఇతరత్రా ఇబ్బందులను త్వరగా సమీక్షించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ఇప్పటివరకు 80% వరకు నష్టపరిహారం అందించడం జరిగింది అన్నారు.

మొత్తం కేటాయించిన 23 కోట్ల 15 లక్షల తో 100% నష్టపరిహారం అందించి పదిహేను రోజుల్లోపు పనులు ప్రారంభిస్తాము అన్నారు.

 

దీంతో కామారెడ్డి నియోజకవర్గానికి 80 వేల ఎకరాలు బాన్సువాడకు పదివేల ఎకరాలు ఎల్లారెడ్డి కి 30 వేల ఎకరాలు మెదక్ జిల్లా రామాయంపేటకు 12 ఎకరాలు సాగునీటిని అందిస్తాం అన్నారు.

 

కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసి చూపిస్తాను అన్నారు.

 

అలాగే గోదావరి జలాలు పూర్తిస్థాయిలో పైప్ లైన్లు మరమ్మతు చేసి కొత్త పైప్లైన్ వేసి 20 సంవత్సరాల వరకు తాగునీటి కొరత రాకుండా చూస్తా అన్నారు.

 

వేసవికాలం వస్తున్నందున నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అన్నారు.

 

గ్రామాల్లో మునిసిపాలిటీల్లో ప్రజాప్రతినిధుల పదవి కాలం పూర్తి అవడంతో.

గ్రామాల్లో ప్రజాప్రతినిధులైన అధికారులైన ఇప్పుడు మీరే గ్రామాల్లో ఎలాంటి సమస్యలైనా పై అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి అన్నారు.

విధుల్లో అలసత్వం వహించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా అసౌకర్యం కల్పిస్తే వారిపై చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు.

మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ .

అమృత్ కాల్ పథకంలో 93 కోట్ల రూపాయలతో తాగునీటి పనులు సమీక్ష జరపగా (గోదావరి జలాలు) 104 కిలోమీటర్ల నుండి రెండో పైపులైన్ పనులు ఇప్పటివరకు 24 కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి.

మరో రెండు నెలల్లో రెండో లైను పూర్తవుతుంది అన్నారు.

 

ఫారెస్ట్ పర్మిషన్లు ఇబ్బంది ఉంటే వెంటనే పై అధికారులతో మాట్లాడి పర్మిషన్లు వారంలో వచ్చేలా చూస్తామన్నారు

 

కామారెడ్డి మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా 7200 ఉచిత నల్ల కలెక్షన్లు కొత్తవి ఇస్తున్నామన్నారు

ఈ వారంలో మొదలవుతాయని చెప్పారు. స్లమ్ ఏరియాలలో ఎక్కువ కలెక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అన్నారు.

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని గ్రామాలతో కలిపి 11 ఎం ఎల్ డి నీరు అవసరం ఉండగా

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి

6 ఎం ఎల్ డి బుర్ర మత్తడి నుండి 1 ఎం ఎల్ డి

పెద్ద చెరువు నుండి 2.5 ఎం ఎల్ డి నీరు వస్తున్నాయి గుర్తు చేశారు.

రెండవ లైన్ పూర్తి అవుతాయి ఎలాంటి నీటి సమస్యలు ఉండవు అన్నారు.

మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ .

వేసవి కాలం పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!