మైనారిటీ గురుకుల విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 7 (అఖండ భూమి న్యూస్);
విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ జీవితానికి బాట వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మైనారిటీ గురుకుల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన పడవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించిన విద్యార్థులను బుధవారం తన ఛాంబర్ లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఉత్తమ విజయాలతో స్ఫూర్తి పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయాలకు కారకులైన జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, ఆర్.ఎల్.సి., ప్రిన్సిపాల్, అధ్యాపక, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. జిల్లా మంచి పేరు తీసుకోవచ్చినందుకు వారి సేవలను కొనియాడారు.
కామారెడ్డి మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు రెండవ సంవత్సరం బిపిసి లో జబ్రాన్ అలీ 991/1000 మార్కులతో రాష్ట్ర స్థాయి 7 వ ర్యాంక్, ఆఫ్రోజ్ 987/1000 మార్కులతో11 వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో బీపీసీ బాన్సువాడ జూనియర్ కళాశాల విద్యార్థులు తవూర 435/440 మార్కులతో రాష్ట్ర 4వ ర్యాంక్, ఆఫ్తాబ్ 432/440 మార్కులతో రాష్ట్ర స్థాయి 7 వ ర్యాంక్ , ఎంపీసీ లో సాత్విక, రాంచరణ్ 461/470 మార్కులతో రాష్ట్ర 7వ ర్యాంక్ సాధించారని వివరించారు. పదవ తరగతి విద్యార్థులు నిక్షయ్ 581/600, రాహుల్ 575/600 మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, ఆర్.ఎల్.సి. కిరణ్ గౌడ్, ప్రిన్సిపల్స్ ఇంతియాజ్ అలీ, వెంకటరాములు, ధనలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



