ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 8 (అఖండ భూమి న్యూస్);
సాధారణ తనిఖీలో భాగంగా ఈ.వి. ఎం. గోదామును పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ.వి. ఎం. గోదామును సాధారణ తనిఖీ గురువారం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ వీణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనీల్, తదితరులు పాల్గొన్నారు.