నిరుపేద అమ్మాయి పెళ్లి కి అండగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర
చైర్మన్ డాక్టర్ బాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద రాజమణి బాలయ్య కుమార్తె లావణ్య కు వివాహం ఉన్నందున నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో వారికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ,స్వప్న దంపతులు పుస్తే మట్టెలు,చీర గాజులు అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ. ఉప్పల శ్రీనివాస్ గుప్తా 53 వ జన్మదినం సందర్భంగా పుస్తె మట్టేలను అందజేయడం జరిగిందని,వేలాది మంది పేదింటి ఆడబిడ్డల వివాహానికి పుస్తే మట్టెలు చీర,గాజులను అందజేయడం మానవతా దృక్పథానికి నిదర్శనం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు వెంకటరమణ లు పాల్గొనడం జరిగింది.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…