బాధిత కుటుంబానికి అండగా ఉంటా

 

బాధిత కుటుంబానికి అండగా ఉంటా

-కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 11(అఖండ భూమి న్యూస్);

మందు పాతర పేలి మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ కుటుంబానికి అండగా ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం పాల్వంచలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు

ఇటీవల ఆపరేషన్ కగార్ లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో నక్సలైట్ లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి వీర మరణం పొందిన కామారెడ్డి నియోజకవర్గం పల్వంచ మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శ్రీధర్ మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ద్వారా మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!