అ ‘పూర్వ’ కలయికకు 30 ఏండ్లు

 

అ ‘పూర్వ’ కలయికకు 30 ఏండ్లు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 11 (అఖండ భూమి న్యూస్);

1994-95 వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఎక్కడెక్కడో స్థిరపడి 30 ఏళ్ల అపూర్వ కలయిక ద్వారా కలిశారు. వీరంతా ఆదివారం దోమకొండ మండలం పెద్దమ్మ గుడి ఆవరణలో గల ఫంక్షన్ హాల్లో కలసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను తలచుంటూ చిన్న పిల్లల్లా మారి సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారు హుషారుగా పాల్గొన్నారు. వీరిలో చాలా మంది వివిధ రంగాలలో స్థిరపడి ఉన్నతంగా రాణించారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించినవారు కూడా ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా తమకు చిన్నపుడు విద్యాబుద్దులు నేర్పిన గురువులకు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ, 30 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని కార్యక్రమాన్ని పిలిచిన విద్యార్థులను అభినందించారు. తమ విద్యార్థులు ఇంకా జీవితంలో తమ అనుకున్న లక్ష్యాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తమ గురువులు నేర్పిన విద్యతోనే తాము నేడు ఈ స్థానంలో ఉన్నామని గర్వగా తెలిపారు. స్నేహానికి మించిన సంపద మరొకటి లేదని తమ మధ్యలేని స్నేహితులను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో 1994- 95 బ్యాచ్ కు చెందిన సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!