ప్రాణహిత చేవెళ్ల పునర్ ప్రారంభంతో
సంబరాలు జరుపుకుంటున్న రైతులు, కాంగ్రెస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డిపట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్ వద్ద జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు లింగారెడ్డి భిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి రాజా గౌడ్ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం ఆదివారం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న కైలాస్ శ్రీనివాసరావు. గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డిలు పాల్గొని
ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.
రైతు కళ్ళలో ఆనందమే షబ్బీర్ అలీ లక్ష్యం అన్నారు.
రైతుల పక్షపాతి షబ్బీర్ అలీ
ప్యాకేజీ పనులపై సమీక్ష హర్షణీయం అన్నారు.
జిల్లా ప్రజలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు హర్షణీయమని అన్నారు.
నా జీవితకాలపు చిరకాల కోరిక ప్రాణహిత చేవెళ్ల (కాళేశ్వరం ) 20,21,22 ప్యాకేజీ ద్వారా జిల్లాలో సాగు నీరు అందించేందుకు చివరి శ్వాస వరకు పోరాటం చేసైన దాన్ని పూర్తి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేయడం యావత్ రైతాంగం కళ్ళల్లో ఆనందం కలిగించే అంశమన్నారు.
జిల్లాకు చెందిన రైతులకు శాశ్వతంగా సాగు నీటి పరిష్కారం చేయడమే లక్ష్యం అన్నారు.
భూసేకరణ , తదితర బిల్లుల చెల్లింపు కోసం 23 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రైతంగానికి తీపి కబురు అందించారన్నారు. ఎత్తిపోతల పథకం పై రైతుల ఆశలు చిగురిస్తున్నాయని
జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఆ ఘనత ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు., కామారెడ్డి మండలా ధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఈ జిల్లా అధ్యక్షులు ఐరేనీ సందీప్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుదర్శన్ ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడుగుల శ్రీనివాస్.ఎల్,
మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు సిరాజుద్దీన్ బీసీ సెల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్, కారంగుల అశోక్ రెడ్డి,దేవరాజ గౌడ్ ,లక్కపతిని గంగాధర్, మాజీ సర్పంచులు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ,రైతులు పాల్గొన్నారు.
You may also like
-
రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అంకంరెడ్డి బుల్లిబాబు
-
14 పంటలకు కనీస మద్దతు ధర పెంచడంపై మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…
-
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బిబిపేటలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా…
-
లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి…
-
సీఎం రిలీఫ్ పాండును అందజేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…