వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకుండా చూడాలి…

కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి . విక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 13 (అఖండ భూమి న్యూస్);
వరి ధాన్యం తూకంలో వ్యత్యాసం రాకూడదని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) అన్నారు. మంగళవారం లింగంపేట్ మండలం కోమటిపల్లి, పోతాయిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ సమాచారం మేరకు అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉందని, రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పి వేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు టార్ఫాలిన్ లను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. ధాన్యం తూకాల్లో వ్యత్యాసం రాకుండా చూడాలని హమాలీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా కేంద్రాల ఇంచార్జీలు, రైతులు పాల్గొన్నారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…


