వదిలివేయబడిన వాహనాలను గుర్తించి 6 నెలల్లోగా తీసుకుపోవాలి
– జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 17. (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో వివిధ ప్రాంతాలలో వదిలివేయబడ్డ లేదా పట్టుబడిన వాహనాలను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో వేలం వేయడం జరుగుతుంది. ప్రస్తుతం 217 వాహనాలు (211 టూవీలర్లు, 3 త్రీ వీలర్లు, 3 ఫోర్వీలర్లు) కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో భద్రపరచబడ్డాయనీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులు తమ వాహనాన్ని గుర్తించి, సరైన ధ్రువపత్రాలతో పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఏ. నవీన్ కుమార్ ( 8712525970 / 8712686111) ను సంప్రదించి, ధ్రువపత్రాలను చూపించి వాహనాన్ని తీసుకు వెళ్లాలన్నారు. యజమానులు వాహనాన్ని తిరిగి పొందేందుకు 6 నెలల గడువు కలదు. గడువు పూర్తి అయిన తర్వాత, వాహనాలు గురుతు తెలియని, గుర్తించలేని ప్రాపర్టీ గా పరిగణించబడి వేలం వేయడం జరుగుతుందనీ ఆ ప్రకటనలో తెలిపారు. వాహనాల పూర్తి వివరాలు కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పొందుపరచబడ్డాయన్నారు.
ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, సూచించారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



