ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; మే 17 (అఖండ భూమి న్యూస్) :
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని భయంపల్లి గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా మాజీ సర్పంచ్ కండ్లపల్లి బాలయ్య మాజీ ఎంపీటీసీ పచ్చింటి. సాయిలు, చింతల సాయిలు, గుట్టమీద సాయిలు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ. గత 20 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరగని అభివృద్ధి మదన్ మోహన్ గెలిచిన 16 నెలల్లో చేసి చూపించారు అని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ పధకాలు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు ప్రజల ఇంటికి వచ్చి సమస్యలు పై తీరుస్తున్నారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న అభివృద్ధిలో భాగం అవ్వాలని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


