ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసిన మోడీ ..!

ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు తీసిన మోడీ ..!

జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 29 (అఖండ భూమి న్యూస్)

అమెరికా ఆదేశించిందని మన ఆడబిడ్డల సింధూరాన్నీ తుడిచిన వారినీ ఆపరేషన్ సింధూర్ తో బుద్ధి

చెప్పకుండా మధ్యలో నిలిపేసి ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు ప్రధానమంత్రి మోడీ తీశారని అన్నారు.

రాష్ట్రంలో దేశంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని కార్యకర్తలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కిందిస్థాయి నుండి మరింత పటిష్టంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలన్నారు.

యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము అని హెచ్చరించారు.

కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.

కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు

గా తీర్చిదిద్దుతాం అని అన్నారు.

అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలన్నారు.

ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు.

కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం అన్నారు.

భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము. అని గుర్తు చేశారు.

కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు అని ఆరోపించారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంది అన్నారు.

ఒక్కొక నియోజకవర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు.

మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తాం. ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయి అని గుర్తు చేశారు.

జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమము గ్రామ గ్రామాన తీసుకు వెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి అని పిలుపునిచ్చారు.

పార్టీ లేకుంటే కండువా లేకుంటే మనకు అవకాశం ఇచ్చేది ఎవరు అని ప్రశ్నించారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా నిలబడాలంటే ముందుగా మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి. మనలో మనం కలిసి ఉండాలన్నారు.

పాత కొత్త అనే తేడా ఉండకూడదు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది ఉన్నారు.

ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు

ఇస్తాం అన్నారు.

క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయి మరోసారి గుర్తు చేశారు.

అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి తప్ప, అడ్డుకోవడంలో కాదు ..

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ. అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి తప్ప అడ్డుకోవడంలో కాదని కామారెడ్డి అభివృద్ధికి ముందుండి కలిసి రావాలి తప్ప అడ్డుకోవడానికి ముందు కాదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రజలు మనల్ని నాయకుడుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని అప్పుడే ప్రజా నాయకుల అవుతాం తప్ప పదవుల కోసం పాకలాడితే కుదరదని అన్నారు. బిజెపి రాష్ట్రానికి చేసిందేమిటి లేదని ప్రజలను రెచ్చగొట్టే అధికారంలోకి రావాలని చూస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. పెహల్గావ్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులను పొట్టన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకున్న కేంద్రానికి అండగా ఉంటామని మాదిస్తానం మద్దతు తెలిపిందని అన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశాడని కాల్పులు విరమించే వెనక్కి తాగి మా సైనికులను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని అన్నారు. 1971 అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పరాయి దేశాలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని ఎవరికి తలగకుండా యుద్ధం చేసి 95000 బందీలను చేసిన ఘనత కాంగ్రెస్ వాటిది ఇందిరా గాంధీకే దక్కుతుందన్నారు.ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలి అని చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలి అని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు

మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!