శ్రీలక్ష్మి భూదేవి చెన్నకేశవ స్వామి కళ్యాణం…
వెల్దుర్తి జూన్ 04 (అఖండ భూమి) : మండల పరిధిలోని ఎస్ పేరామల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ భూదేవి, చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవం శనివారం పగలు 12 గంటల ఐదు నిమిషములకు జరుగుతున్నట్లు గ్రామ పెద్దలు విలేకరులకు ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తారీకు శుక్రవారం నుండి 7వ తారీకు శనివారం వరకు స్వామివార్ల మహోత్సవాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం వేద పండితులచే నిర్వహించబడుతున్నట్లు గ్రామ ప్రజలు భక్తులు తెలిపారు. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నము అన్నదానం దాతలు కీర్తిశేషులు బొంతల లక్ష్మిరెడ్డి శ్రీమతి బొంతల లక్ష్మీ దేవమ్మ గార్ల కుమారులు బొంతల రామకృష్ణారెడ్డి ధర్మపత్ని శ్రీ మతి రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు ద్వారా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవానికి అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. భక్తాదులందరూ పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని దిగ్విజయం చేయాలని గ్రామ ప్రజలు కోరారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..