ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలి…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 9 (అఖండ భూమి న్యూస్) :
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. అనంతరం జిల్లాలోని పాఠశాలలు జూన్ 12 నుండి ప్రారంభం అవుతున్నందున పాఠశాల యొక్క స్థితిగతులను మండల స్పెషల్ ఆఫీసర్లు ఎంపీడీవోలు పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల యొక్క పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. అనంతరం ఇతర శాఖల యొక్క పనులపై అలా తీసి పూర్తిచేయాలని అన్నారు. భూ సమస్యలు రెండు పడకల గదుల ఇల్లు మంజూరు రైతు భరోసా పెంచల మంజూరు తదితర అంశాలపై అర్జీలు ఈరోజు చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో 50 అర్జీలు పలు శాఖలకు చెందిన అందాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ చందర్ ,కామారెడ్డి ఆర్ డి ఓ వీణ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.