అంగరంగ వైభవంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవానుల కళ్యాణ మహోత్సవం..
జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులు..
700 మందికి అన్న ప్రసాద వితరణ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 9 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవానుల కళ్యాణ మహోత్సవాన్ని ప్రణయ దాసాజీ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గణపతి పూజ,గౌరీ పూజ,పాదుక పూజా కార్యక్రమం,అమ్మ భగవాన్ కల్యాణ మహోత్సవాన్ని భక్తుల కోలాహలం మధ్య నిర్వహించడం జరిగింది.ఈ రోజును బాంధవ్యాల దినోత్సవం గా నిర్వహించడం జరిగింది.
ఈ కళ్యాణ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ నాగేశ్వరరావు సులోచన ఎల్లారెడ్డి,లైఫ్ హాస్పిటల్ ఎండి ముజీబుద్దిన్,శ్రీ ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి,చీకోటి వెంకటేష్ విజయ నిజామాబాద్,మ్యాడం వెంకటేష్ హేమలత,వసుధ హోటల్ వేణువాణి,ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్,పబ్బ స్వప్న వేణు,కామారెడ్డి న్యూరో హాస్పిటల్ నిర్వాహకులు చీకోటి అశోక్,పులగం రాఘవరెడ్డి లు సహకరించడం జరిగింది.దాతలకు ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సేవకులు ఎర్రం చంద్రశేఖర్,ఎర్రం విజయ్,డాక్టర్ బాలు,ఎర్రం సూర్యకాంతం, దిగంబర్,పప్పుల శ్రావణి,పబ్బ జ్యోతి,పాత స్వరూప లు పాల్గొనడం జరిగింది.