బెల్లంపల్లిలో వర్షం,ఈదురు గలుల బీభత్సవం
బెల్లంపల్లి జూన్ 11(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి బెల్లంపల్లి కోర్ట్ ప్రాంగణం,పోలీస్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ ముందు,బెల్లంపల్లి బస్తిలోని ప్రభుత్వ కళాశాల బోర్డు,గాంధీ నగర్ లో సుమారుగా 6 కరెంట్ స్తంబాలు విరిగి నెలకొరిగాయి,ఇంకా పలుచోట్లా చెట్లు విరిగి పడటం వళ్ళ కరెంట్ కు అంతరాయం కలిగింది.చెట్లు విరిగి కొన్నిచోట్ల రోడ్లకు అడ్డంగా పడటం వలన ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడింది.మంగళవారం రాత్రినుండి కరెంట్ లేక ప్రజలు నాన ఇబ్బందులకు గురౌతున్నారు.కరెంట్ విషయంలో సంబంధిత అధికారులు ఇప్పటికే తగు చార్యలు చేపట్టారు. ప్రజల కరెంట్ కోసం ఎదురు చుస్తునారు కరెంట్ ఎపుడు వస్తుందో వేచి చూడాలి…