సీఎం జగన్‌ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్‌ ఏ‍ర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. క్రమంలో సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు.సిక్కుల కోసం కార్పొరేషన్‌ ఏ‍ర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌.గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!