కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యా మిత్ర కిట్ల పంపిణీ

కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యా మిత్ర కిట్ల పంపిణీ

యర్రగొండపాలెం అఖండ భూమి:యర్రగొండపాలెం పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ తిరుమలాదేవి ఆధ్వర్యంలో గురువారం పుస్తకాలతో పాటు విద్యా మిత్ర కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చేకూరి సుబ్బారావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి. ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించిన రోజే విద్యార్ధులకు విద్యామిత్ర కిట్లను అందించడం శుభ పరిణామమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సంబంధ సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు పెరుమాళ్ల మల్లికార్జున, మంత్రు నాయక్, కంచర్ల సత్యనారాయణ గౌడ్, షేక్ మస్తాన్ వలి,దొంతా వెంకట్రావు గౌడ్, గోళ్ల సుబ్బారావు, బిజెపి నాయకులు మాదాల సూర్య నారాయణతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!