సీఎం బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి సంబరాలు
యర్రగొండపాలెం, అఖండ భూమి:కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి విశ్వసనీయతను చాటుకుందని యర్రగొండపాలెం ఏఎంసి చైర్మన్ చేకూరి సుబ్బారావు అన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం యర్రగొండపాలెం పట్టణంలో టిడిపి కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా చేకూరి సుబ్బారావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ విశ్వసనీయతను చాటుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ. రైతుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాలలో ప్రభుత్వం ప్రభావవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడా శ్రీశైలపతి నాయుడు, టిడిపి పట్టణ అధ్యక్షులు పెరుమాళ్ల మల్లికార్జున, టిడిపి నాయకులు మంత్రు నాయక్, కంచర్ల సత్యనారాయణ గౌడ్,షేక్ మస్తాన్ వలి,దొంతా వెంకట్రావు గౌడ్, గోళ్ల సుబ్బారావు, పాలడుగు వెంకట కోటయ్య, చెవుల అంజయ్య మెడబలిమి అచ్యుతరావు, చిట్టేల వెంగళరెడ్డి, వేదూరి లక్ష్మయ్య, కేశనపల్లి మల్లికార్జున, కొత్తమాసు సుబ్రమణ్యం. రమణమ్మ, చెన్న వీరయ్య నాయుడు, బిజెపి నాయకులు మాదాల సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
కురుపాం ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు…
-
బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
-
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యా మిత్ర కిట్ల పంపిణీ
-
సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తున్న శ్రీను కి ఘన సన్మానం!
-
రైతులకు ఖరీఫ్ పంట విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు.