బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

యర్రగొండపాలెం అఖండ భూమి:బాల కార్మిక వ్యతిరేక మాసం సందర్భంగా గురువారం సార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో తహశిల్దార్ డి మంజునాథరెడ్డి, ఎస్సై పి చౌడయ్య, ఎంఈవో-2 మల్లు నాయక్లు గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలలు పనిచేసే వాతావరణాన్ని కాకుండా చదువుకునే, అభివృద్ధి చెందే వాతావరణాన్ని కల్పించాన్నారు. పిల్లలు బడికి-పెద్దలు పనికి, ఐడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి, అందరు చదవాలి-అందరు ఎదగాలి వంటి నినాదాలతో గ్రామాలలో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. బాల కార్మికత్వాన్ని నిర్మూలించడానికి సమాజం మొత్తం కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరి బాధ్యతతోనే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు. సమాజం ఎదుగుదల విద్యలో నుంచే మొదలవుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశజారు. పిల్లలకు ప్రభుత్వ విద్య ఉచితంగా లభిస్తోందని, కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ప్రతి తల్లితండ్రులు బాధ్యతగా పిల్లలను బడికి పంపించాలన్నారు. బాల్యాన్ని పనిలో పెట్టే విధంగా కాకుండా పాఠశాలలో చదువుతూ వికసించేలా చేయాలన్నదే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. చట్టపరంగా కూడా 14 సంవత్సరాల లోపు బాలులను ఏ పని చేయించినా అది నేరమని, అలాగే 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు కల కౌమార బాలలను ప్రమాదకరమైన పనులలో నియమించడం కూడా చట్టరీత్యా నేరమేనని స్పష్టం చేశారు. పిల్లలను పని చేయడానికి పంపించడం వలన వారు చిన్న వయసులోనే. జీవన పోరాటంలో చిక్కుకుంటారని, వారి భవిష్యత్తు సందిగ్ధంలో పడిపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సార్ట్స్ సంస్థ సభ్యులు మంద మరియబాబు, మహాలక్ష్మి బ్రహ్మయ్య, కె ధర్మనాయక్, చిన్నబాబు, గురవయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!